ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. నేటితో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాద్యతలు స్వీకరించి మూడు వసంతాలు పూర్తయ్యాయని చెప్పారు. నాడు తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీ..కాంగ్రెస్ అగ్రనేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయంపై ట్విట్టర్ లోఆసక్తికర ఫొటో షేర్ చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం.. సోనియా గాంధీ సారథ్యంలో విజయభేరి నిర్వహించడం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం మూడేండ్లలో ఈ మూడు ఘట్టలు జీవితంలో మరువలేనివన్నారు. ఈ ప్రస్తానంలో తనకు సహకరించిన పార్టీ సీనియర్ నేతలు, కఠోర శ్రమ చేసిన లక్షలాది మంది కార్యకర్తలు, నాలుగు కోట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
నేటితో…
— Revanth Reddy (@revanth_anumula) July 7, 2024
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా…
బాధ్యతలు స్వీకరించి…
మూడు వసంతాలు పూర్తయ్యాయి.
నాడు నాపై ఎంతో నమ్మకంతో…
ఈ బాధ్యతలు అప్పగించిన…
శ్రీమతి సోనియాగాంధీ గారికి…
కాంగ్రెస్ అగ్రనేతలందరికీ కృతజ్ఞతలు.
పీసీసీ అధ్యక్షుడుగా…
బాధ్యతలు స్వీకరించడం.
శ్రీమతి సోనియా గాంధీ… pic.twitter.com/ha4R9EyTxg