
- ఆర్ఆర్ ట్యాక్స్వసూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
- కృష్ణా జలాలపై నిలదీస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నరని కామెంట్
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ రక్షణ కవచంలా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ని అంతా ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారని, అలాంటప్పుడు సంజయ్కి చేతనైతే ఆర్ఆర్ ట్యాక్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతున్నదని ప్రశ్నించారు. బీజేపీలో చేరుతానని రేవంత్ రెడ్డి ఏదైనా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ టెండర్లలో రేవంత్ బావమరిది స్కాం చేసినా కేంద్రం ఎందుకు కాపాడుతున్నదని నిలదీశారు. పొంగులేటిపై ఈడీ దాడి చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. సుంకిశాల ప్రమాదంలోనూ రేవంత్ ఎవరిని కాపాడుతున్నారో తెలుసన్నారు.
కృష్ణా జలాలపై లేఖ రాసి చేతులు దులుపుకున్నరు
కృష్ణా జలాలపై సీఎం రేవంత్ కేవలం ఉత్తరం రాసి చేతులు దులుపుకున్నారని కేటీఆర్అన్నారు.కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే సీఎం ఉద్యోగం పోతుందని రేవంత్ భయపడుతున్నారని అన్నారు. రేవంత్అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి తెలంగాణ దివాళా తీస్తుందని విమర్శించారు. సొంత రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చిందని చెప్పిన దివాళాకోరు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరేనన్నారు.
కానీ, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దివ్యంగా ఉన్న రాష్ట్రం.. రేవంత్ పాలనలోనే దివాళా తీసిందని ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాస్తవాలు చెప్పారని కేటీఆర్ అన్నారు. అప్పులపై రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్స్టాటిస్టికల్ అట్లాస్ నివేదికలో ఒప్పుకున్నదన్నారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఆ రిపోర్టును ప్రభుత్వం వెబ్సైట్ నుంచి తొలగించిందన్నారు. రేవంత్ తిక్క నిర్ణయాలు, హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతోనే రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్అన్నారు.