హైదరాబాద్​లో రివీల్​ ఆఫీస్​

హైదరాబాద్​లో రివీల్​ ఆఫీస్​

హైదరాబాద్​, వెలుగు :  ఆసియా–-పసిఫిక్  ప్రాంతంలో  ఉనికిని విస్తరించడంలో భాగంగా ఏఐ- ఆధారిత  ఈడిస్కవరీ, రివ్యూ,  రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్​​ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ‘రివీల్’​ హైదరాబాద్​లో కొత్త  ఆఫీసును ప్రారంభించింది.  ప్రారంభోత్సవంలో సంస్థ సీఈఓ వెండెల్ జిసా, తెలంగాణ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జస్టిస్ పొనుగోటి నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో రివీల్​ ఇండియా డైరెక్టర్ రాజ్ శివరాజు నాయకత్వంలో

‘ఏఐ  యుగంలో శక్తి, జవాబుదారీతనం, బాధ్యత’ అనే అంశంపై చర్చ జరిగింది. ఏఐ పౌర సేవలను ఎలా మెరుగుపరుస్తుంది ? ప్రభుత్వ ప్రక్రియలను ఎలా వేగవంతం చేస్తుంది ?   అత్యవసర సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో వివరించారు. పరిశోధన, డాక్యుమెంట్ అనాలిసిస్,  కేస్ ప్రిడిక్షన్‌‌‌‌‌‌‌‌లోనూ ఏఐను వాడుకోవచ్చని రాజు వివరించారు.  కొత్త ఆఫీసు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, ఏఐ, జనరేటివ్ ఏఐ టీమ్స్​పై ఫోకస్​చేస్తుంది. ఈ ఆఫీసులో 300 మంది పనిచేస్తారు.