
- వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జైసింగ్ రాథోడ్
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన క్యాన్సర్ ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. బుధవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్కు చెందిన ముగ్గురికి కడుపులో క్యాన్సర్, మరొకరికి క్లోమం క్యాన్సర్ ఆపరేషన్లు చేశామని చెప్పారు.
ఇటీవల నలుగురికి సర్జరీ చేశామని, వారు పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ఈ సర్జరీలకు ప్రైవేట్ హాస్పిటల్స్లో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని పేర్కొ న్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల క్యాన్సర్లకు ఆపరేషన్లు చేస్తున్నామని, ఇప్పటివరకు దాదాపు 400 ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. కిడ్నీ, పీడియాట్రిక్, న్యూరో సర్జరీలు జరుగుతున్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదారబాద్, నాగ్పూర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ స్థాయిలో చికిత్స అందుతున్నాయని తెలిపారు.