రిమ్స్ లో అండాశయ క్యాన్సర్​ సర్జరీ

రిమ్స్ లో అండాశయ క్యాన్సర్​ సర్జరీ

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: రిమ్స్ సూపర్​స్పెషాలిటీ పీడియాట్రిక్ విభాగంలో పీడియాట్రిక్​సర్జన్​ దేవిదాస్​అరుదైన సర్జరీ చేశారని హాస్పిటల్ ​డైరెక్టర్​ జైసింగ్​రాథోడ్ ​తెలిపారు. శనివారం రిమ్స్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాప అండాశయ క్యాన్సర్ తో బాధపడుతూ హాస్పిటల్​లో చేరిందన్నారు. డాక్టర్​దేవిదాస్ ఆమెకు విజయవంతంగా సర్జరీ చేశారని పేర్కొన్నారు. రిమ్స్ లో నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నామని, కార్పొరేట్​ హాస్పిటల్స్​లో లేని సదుపాయాలు ఇక్కడున్నాయని చెప్పారు.

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం హెర్నియా, టాన్సిలెక్టమీ తదితర సర్జరీలు చేయించుకొని, కోలుకున్న పిల్లలను డిశ్చార్జ్​ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, యూరాలజీ వైద్య నిపుణుడు కుమ్మరి కార్తీక్ పటేల్, గ్యాస్ట్రాలజీ వైద్య నిపుణుడు వివేక్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.