
వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మిజోరంలోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్ అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 7వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య 13: ఎంఎల్టీ, ఆర్ఐటీ, ఆప్ట్రోమెట్రి విభాగాల్లో ప్రొఫెసర్, ఆర్ఐటీ, ఫిజియోథెరఫి, డియాటిటిక్స్ లో అసోసియేట్ప్రొఫెసర్, సీనియర్ స్కేల్ ఎంఎల్ టీ, సీనియర్ స్కేల్ నర్సింగ్, ఫిజియోథెరపి, నర్సింగ్, డియోటిటిక్స్, ఎంఎల్ టీ, ఆప్టోమెట్రీలో అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్ డీ, మాస్టర్ డిగ్రీ, ఎంఎస్సీ నర్సింగ్, డీ–ఫార్మాసిలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి ప్రొఫెసర్ కు 50 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 40 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 35 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా. డైరెక్టర్, రిపాన్స్, జిమాబాక్, ఐజ్వాల్, మిజోరం చిరునామాకు అప్లికేషన్లను పంపించాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంఏఎన్ఐటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఏఎన్ఐటీ) అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య 22: అసిస్టెంట్ప్రొఫెసర్ గ్రేడ్–1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–2.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 16.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.