‘శ్వాగ్’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన రీతూ వర్మ.. తాజాగా కొత్త చిత్రం షూటింగ్లో జాయిన్ అయింది. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ‘మజాకా’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా కో ప్రొడ్యూసర్.
హీరోయిన్గా రీతూ వర్మ నటిస్తున్న విషయాన్ని శనివారం మేకర్స్ కన్ఫర్మ్ చేస్తూ, ఈ మూవీ సెట్స్లో సందీప్ కిషన్తో ఆమె కలిసున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో రీతూ పెళ్లికూతురు గెటప్లో కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం వైజాగ్లో షూటింగ్ జరుగుతోంది. 20 రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్తో పాటు లీడ్ యాక్టర్స్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్లో ఇది 30వ సినిమా. ప్రసన్న కుమార్ బెజవాడ రచయితగా వ్యవహరిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరోవైపు ‘శ్రీకారం’ ఫేమ్ కిషోర్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లోనూ రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది.