హైదరాబాద్, వెలుగు: ఇండీ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే బెంగళూరుకు చెందిన రివర్ హైదరాబాద్ మార్కెట్లో అడుగుపెట్టింది. కూకట్పల్లిలో మొదటి షోరూమ్ను బుధవారం ప్రారంభించింది. సమీప భవిష్యత్తులోనే చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు, త్రివేండ్రం లాంటి నగరాలకు విస్తరిస్తామని రివర్ సీఈఓ అరవింద్ మణి చెప్పారు. హైదరాబాద్లో మరిన్ని స్టోర్లు తెరుస్తామని చెప్పారు.
ఇండీ హైదరాబాద్లో ఎక్స్ షోరూం ధర రూ.1.38 లక్షలు. దీనిని ఐదు గంటలు చార్జ్చేస్తే 120 కిలోమీటర్లు వెళ్తుంది. మాగ్జిమమ్ స్పీడ్ 90 కిలోమీటర్లు.