40 ఏండ్లుగా సైకిల్​పైనే సేవలు

40 ఏండ్లుగా సైకిల్​పైనే సేవలు

భైంసా  వెలుగు : ఓ ఆర్ఎంపీ వైద్యుడు 40 ఏండ్లుగా సైకిల్​పైనే వైద్య సేవలు అందిస్తున్నాడు. కాలం మారినా ఆయన మాత్రం తన పంథాను మార్చుకోలేదు. దివ్యాంగుడైనప్పటికీ రోజు దాదాపు 30 కిలోమీటర్లు సైకిల్​ తొక్కుతూ ఊరూరా తిరుగుతూ వైద్యం అందిస్తున్నారు.

భైంసాకు చెందిన ఆర్​ఎంపీ దొడ్లోళ్ల సత్యనారాయణ(60). మండలంలోని కోతుల్​గాం, బిజ్జూర్, ఎగ్గాం, చింతల్​బోరి, మాటేగాం తదితర గ్రామాలకు సైకిల్​పైనే వెళ్తూ పేదలకు తక్కువ ఫీజుతోనే వైద్య సేవలు చేస్తూ అందరికి ఆత్మీయుడయ్యారు.