ఓవర్​ టేక్​చేయబోయాడు.. ప్రాణాలు పోయాయి..

ఓవర్​ టేక్​చేయబోయాడు.. ప్రాణాలు పోయాయి..

బస్సును ఓవర్ టేక్ చేయబోయి యువకుడి మృతి ..మరొకరికి గాయాలు

శామీర్​పేట, వెలుగు: బైక్​పై బస్సును ఓవర్ టేక్ చేయబోయి యువకుడు దుర్మరణం చెందాడు. కరీంనగర్​కు చెందిన షేక్ సక్లిన్ (22) తన స్నేహితుడు మహమ్మద్ ఫర్హాన్​తో కలిసి హోండా యాక్టివాపై కరీంనగర్ నుంచి మెహదీపట్నం బయలుదేరారు. గురువారం రాత్రి శామీర్ పేట వద్ద అతివేగంగా ఆర్టీసీ బస్సును ఓవర్​టేక్ చేయబోయి డివైడర్ ను ఢీ కొట్టాడు. అనంతరం బస్సు వెనుక టైర్ల కిందపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో సక్లిన్ అక్కడికక్కడే మృతి చెందగా, ఫర్హాన్​కు గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై శామీర్​పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.