
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ సమీపంలోని కొత్తగూడ గాదే వాగు వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. క్షతగాత్రులను నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నారు. మధ్య ప్రదేశ్ నుంచి ఖమ్మం జిల్లా జూలూరుపాడుకు మిర్చి పంటను కోసేందుకు వలస కూలీలు వస్తున్నారు.