
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సిద్దాపూర్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సును ఢీకన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా వాసులు శంకర్ రాథోడ్(25), పవన్ జటోత్ (26) లుగా గుర్తించారు. సిద్దాపూర్ తండా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న తాండూరు డిపోకు చెందిన బస్సు బైక్ ను ఢీకొట్టింది.