డప్పు చప్పుళ్లకు..టీమిండియా ఆటగాళ్లు చిందులు

 డప్పు చప్పుళ్లకు..టీమిండియా ఆటగాళ్లు చిందులు


టీ-20 వరల్డ్ కప్ గెలుపుతో ఫుల్ జోష్ లో ఉన్నారు టీమిండియా క్రికెటర్లు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదిస్తూ కప్పు గెలిచి భారత్ కువచ్చిన టీమిండియా ప్లేయర్లు.. డప్పు చప్పుళ్లకు చిందేశారు.  ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి  ఐటీసీ మౌర్యకు చేరుకున్న భారత జట్టుకు అక్కడ  డప్పు చప్పుళ్లతో వెల్కమ్  చెప్పారు  హోటల్ సిబ్బంది. ఈ క్రమంలో అక్కడే  డప్పు చప్పుళ్లకు  అనుగుణంగా టీమిండియా సారధి రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్, పంత్  లు  మాస్  స్టెప్పులేశారు. భారత క్రికెటర్ల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి.  

అంతకుముందు టీ-20వరల్డ్ కప్ గెలిచి భారత్ లో అడుగుపెట్టిన టీమిండియాకు  గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. వారిని అభినందించేందుకు దూర ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. జాతీయ జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు. వరల్డ్ కప్ ట్రో ఫీని ఫ్యాన్స్ కు చూపిస్తూ అభివాదం చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ తర్వాత  ప్రత్యేక భద్రత మధ్య ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు ఇండియన్ క్రికెటర్లు, కోచ్, సిబ్బంది. 

Also Read:స్పెషల్ ఫ్లైట్లో స్వదేశానికి చేరుకున్న టీమిండియా జట్టు

టీ-ట్వింటీ ఫైనల్స్ లో విజయం సాధించి.. పొట్టి కప్పును సొంతం చేసుకుంది భారత జట్టు. ఆదివారమే టీం ఇండియాకు రావాల్సి ఉండగా.. బార్బడోస్ లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడే ఉండిపోయింది. నిన్న కాస్త హరికేన్ ప్రభావం తగ్గడంతో ప్రత్యేక విమానం భారత జట్టు బయలు దేరి..ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.  చాలా ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు గ్రాండ్ వెల్కం చెప్పారు క్రికెట్ లవర్స్.