కొత్తగూడెంలోని బస్టాండ్​ పై కప్పు పెచ్చులు ఊడి పడుతున్నయ్!

కొత్తగూడెంలోని బస్టాండ్​ పై కప్పు పెచ్చులు ఊడి పడుతున్నయ్!

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అక్కడేమో రోగులు.. ఇక్కడేమో  ప్రయాణికులు.. బిక్కు బిక్కుమంటూ భయంతో ఉంటున్నారు. కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్​ జనరల్​ హాస్పటల్​(జీజీహెచ్​), బస్టాండ్​లోని పైకప్పు పెచ్చులు తరుచూ ఊడి పడుతున్నాయి. ఇటీవల వానలకు బస్టాండ్​ స్లాబ్​ లీకేజీ అవుతోంది.

ఎక్కడ జారి పడిపోతామోనని, ఎప్పుడు పై కప్పు పెచ్చులూడి పైన పడుతాయోనని ప్రయాణికులు భయపడుతున్నారు. బస్టాండ్​తో పాటు, జీజీహెచ్​ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​తో పాటు సంబంధిత అధికారులు వచ్చి చూస్తున్నారే తప్ప శాశ్వతంగా రిపేర్లు చేయడం లేదు. ఇప్పటికైనా రిపేర్లు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.