
- మామ్స్ కిచెన్ అండ్ రెస్టారెంట్కు రూ.5 వేల జరిమానా
ఆదిలాబాద్, వెలుగు: కుళ్లిన మాంసం, బూజు పట్టిన స్వీట్లను రోజుల తరబడి ఫ్రీజర్లో ఉంచి వ్యాపారం చేస్తున్న ఘటన బయటపడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మున్సిపల్ శానిటరీ అధికారుల తనిఖీలు చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో మామ్స్ కిచెన్ అండ్ రెస్టారెంట్లో ఫ్రీజర్లో ఉంచిన చికెన్, మటన్ మాంసపు నిల్వలను గుర్తించారు. ఫ్రీజర్ తీయగానే దుర్వాసన రావడంతో కంగుతిన్నారు.
మాంసం కుళ్లిపోయి.. దుర్వాసన వస్తున్నా వంటకాల్లో అదే వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని రెస్టారెంట్ నిర్వాహకులపై ఇన్స్పెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్కు రూ.5 వేల జరిమానా విధించారు. ఇక రైతు బజార్ సమీపంలోని వెంకటేశ్వర స్వీట్ హోమ్లో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ శానిటరీ అధికారులు.. బూజుపట్టిన స్వీట్ పదార్థాలు గుర్తించారు. నిర్వహకులకు వార్నింగ్ ఇచ్చి నోటీసులు అందజేశారు.