కేంద్ర బడ్జెట్లో మంత్రివర్గం, కేబినెట్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం ఖర్చులు, స్టేట్గెస్ట్ల ఆతిథ్యం కోసం రూ.1,024.30 కోట్లు కేటాయించారు. ఇది 2024-25లో కేటాయించిన రూ.1,021.83 కోట్ల కంటే కొంచెం ఎక్కువ.
మంత్రుల ఖర్చుల కోసం మొత్తం రూ.619.04 కోట్లు కేటాయించారు. ఈ నిధులను కేబినెట్ మంత్రులు, మాజీ ప్రధానుల జీతాలు, ఇతర భత్యాలు, ప్రయాణ ఖర్చుల కోసం వినియోగిస్తారు. అలాగే, నేషనల్సెక్యూరిటీ కౌన్సిల్సెక్రటేరియెట్కు రూ.182.75 కోట్లు కేటాయించారు.
పీఎంఓ పరిపాలనా ఖర్చులకు రూ.70.91 కోట్లు కేటాయించారు. హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ కోసం రూ.4 కోట్లు అలాట్ చేశారు.