
- వెల్ విజన్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరావు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు:పెట్టుబడి స్కీముల పేరిట 200 మంది బాధితుల నుంచి రూ.14 కోట్లు వసూలు చేసి, రిటర్న్స్ ఇవ్వకుండా మోసం చేసిన వెల్విజల్గ్రూప్ఆఫ్ కంపెనీ చైర్మన్ కందుల శ్రీనివాసరావును సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శ్రీనివాస్రావు(44) హైదరాబాద్లోని గోకుల్ ప్లాట్స్ వెంకట రమణ కాలనీలో వెల్విజన్ గ్రూప్ ఆఫ్ పేరిటకంపెనీ ఏర్పాటు చేసి, దానికి చైర్మన్గా ఉన్నాడు. ఇతని భార్య డైరెక్టర్గా కొనసాగుతుంది. తన కంపెనీలో ఉన్న వివిధ స్కీముల్లో పెట్టుబడి చేస్తే పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తానని సోషల్ మీడియా, ఇతర సామాజిన మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు.
స్కీమ్-1లో.. ఒక వ్యక్తి లక్ష డిపాజిట్చేస్తే 100 రోజుల పాటు రోజుకి రూ.2 వేలు చొప్పున చెల్లిస్తానని ప్రకటించాడు. స్కీమ్-2లో.. లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.20 వేల చొప్పున పది నెలల పాటు చెల్లిస్తామని, స్కీమ్-3లో రూ. 6.50 లక్షలు డిపాజిట్ చేస్తే నగర శివారులో 121 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్చేస్తామని, ఆ తర్వాత 20 నెలల పాటు నెలకు రూ.32,500 ఇస్తామని ప్రకటించారు.
దీని కోసం ఎంఓయూతో పాటు చెక్కులు కూడా చెల్లిస్తామని తెలిపారు. స్కీమ్-4లో వెస్విజన్హోం అప్లయన్సెస్లో టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ వంటి వస్తువులు కొనుగోలు చేస్తే వస్తువు ధరను ప్రతి నెల తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇలా ప్రతి స్కీమ్లో రూ.10 వేల నుంచి రూ.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చని తెలిపారు. అయితే, ఈ స్కీమ్ల గురించి తెలుసుకున్న రాజేంద్రనగర్ అత్తాపూర్కు చెందిన ఝాన్సీ స్కీమ్ -1,2లలో పెట్టుబడులు పెట్టింది. అయితే, నెలలు గడిచినా రిటర్న్స్రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు శ్రీనివాస్రావును మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు వివిధ స్కీమ్ల పేరుతో 200 మంది నుంచి రూ. 14 కోట్లు వసూల్ చేసినట్లు గుర్తించారు.