హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రూ.25 లక్షల నగదు బహుమతి

హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రూ.25 లక్షల నగదు బహుమతి

ప్రతిష్టాత్మక ఆలిండియా బుచ్చిబాబు టోర్నీ విజేతగా నిలిచిన హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్(HCA) శుభవార్త చెప్పింది. ఏడేళ్ల తరువాత టైటిల్ నెగ్గి హైదరాబాద్ జట్టు సత్తా ఏంటో నిరూపించిన ఆటగాళ్లకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. 

శుక్రవారం(సెప్టెంబర్ 13) ఉప్పల్ స్టేడియం వేదికగా హెచ్‌సీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు సన్మాన కార్యాక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ హైదరాబాద్ ఆటగాళ్లతో కాసేపు సంభాషించారు. విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. 

ఫైనల్లో ఛత్తీస్‪ఘడ్ చిత్తు

ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన ఫైనల్లో హైదరాబాద్‌ జట్టు 243 పరుగుల తేడాతో  విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగుల  ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆట తీరు కనబరిచింది. రోహిత్ రాయుడు (155) శతకం బాదగా.. బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (5/60) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. విజేతగా నిలిచిన హైదరాబాద్‌కు ట్రోఫీతో పాటు రూ. 3 లక్షల ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ దక్కింది. 

సంక్షిప్త స్కోర్లు 

  • హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌: 417 ఆలౌట్
  • హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌: 281 ఆలౌట్
  • ఛత్తీస్‌ఘడ్ తొలి ఇన్నింగ్స్‌: 181 ఆలౌట్
  • ఛత్తీస్‌ఘడ్ రెండో ఇన్నింగ్స్‌: 274 ఆలౌట్