కొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో..రూ. 25.50 లక్షల డైనింగ్ హాల్  ప్రారంభం

కొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో..రూ. 25.50 లక్షల డైనింగ్ హాల్  ప్రారంభం
  • విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో 

భద్రాచలం, వెలుగు:  భద్రాచలంలోని కొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.25.50లక్షల వ్యయంతో నిర్మించిన ఫ్యాబ్రికేటెడ్​ భోజనశాలను సోమవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్లతో కలిసి వారు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, విద్యాభివృద్ధికి ఐటీడీఏ పీవో బి.రాహుల్ కృషి చేస్తున్నారని అభినందించారు.

పీవో రాహుల్​ మాట్లాడుతూ.. స్కూళ్లు తిరిగి ఓపెన్​అయ్యే నాటికి అవసరమైన రిపేర్లు, కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేసేలా యాక్షన్​ ప్లాన్​ అమలు చేస్తామన్నారు. కెరీర్ గైడెన్స్ పై దృష్టి సారించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, ఏటీడీవో అశోక్​కుమార్​, హెచ్​ఎం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.