బషీర్ బాగ్, వెలుగు: సెకండ్ హ్యాండ్ వెహికల్స్పేరిట సిటీకి చెందిన వ్యాపారిని సైబర్నేరగాళ్లు చీట్చేశారు. రూ.38లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన వ్యాపారి(41)కి సైబర్నేరగాళ్లు పలు వాట్సాప్నంబర్ల ద్వారా సంప్రదించారు. మంచి కండిషన్ లో ఉన్న హైఎండ్ కార్లు, జేసీబీ, ఐచర్ వెహికల్స్ ఉన్నాయని.. తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మబలికారు.
చోళమండల్ ఇన్వెస్ట్మెంట్ఫైనాన్స్ కంపెనీ పేరిట వెహికల్స్ వివరాలు పంపారు. నిజమేనని నమ్మిన వ్యాపారి రూ.37లక్షల95వేలు పంపించాడు. తర్వాత వెహికల్స్ రాకపోవడంతో ఫోన్చేసి నిలదీయగా, స్కామర్లు దాటవేస్తూ వచ్చారు. మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.