
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పరిధిలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు కలిసి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.7.17 కోట్ల విలువైన 2,380 కిలోల డ్రగ్స్ను అధికారులు బుధవారం దహనం చేశారు. నందిగామ మండలం ఏదులపల్లి గ్రామంలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో డ్రగ్స్ను డిస్పోజ్ చేశారు. డ్రగ్స్ లో 2,286 కిలోల గంజాయి, 354 గంజాయి మొక్కలు, 48 కిలోల గంజాయి చాక్లెట్లు, 8 లీటర్ల హాష్ ఆయిల్, 87 గ్రాముల ఎండీఎంఏ, 72 గ్రాముల కొకైన్, అల్ఫాజోలం 10 కిలోలు, గంజాయి పౌడర్ 132 గ్రాములు, ఓపియం 1.64 కిలోలు, చరాస్ 26 కిలోలు ఉన్నాయి.