
మెహిదీపట్నం, వెలుగు: మాసబ్ట్యాంక్లో రూ.8లక్షల హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఏసీ గార్డ్స్ఏరియాలో ఉండే మహమ్మద్అఖిల్ మేకల వ్యాపారి. ఇతను దుబాయ్కు చెందిన అబ్బు అనే వ్యాపారి కోసం పనిచేస్తున్నాడు. అబ్బు సూచనలతో గురువారం అర్ధరాత్రి తర్వాత రూ.8 లక్షల హవాలా డబ్బును తరలిస్తుండగా మాసబ్ ట్యాంక్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్కమ్ట్యాక్స్అధికారులకు అప్పించారు. అఖిల్ను అరెస్ట్చేసి రిమాండుకు తరలించారు.