పెబ్బేరు మార్కెట్​ యార్డులో..రూ.8.44 కోట్లతో గోదాముల నిర్మాణం

పెబ్బేరు మార్కెట్​ యార్డులో..రూ.8.44 కోట్లతో గోదాముల నిర్మాణం

పెబ్బేరు, వెలుగు :  వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్​ యార్డులో  గోదాం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఏఎంసీ చైర్​పర్సన్​ ప్రమోదిని అన్నారు. శుక్రవారం పెబ్బేరు మార్కెట్​ యార్డులో  మీడియాతో మాట్లాడారు.  5500 మెట్రిక్​ టన్నుల కొత్త గోదాం  నిర్మాణానికి రూ.5.50 కోట్లు, అగ్ని ప్రమాదంలో కాలిపోయిన గోదాం  రెనోవేషన్​ కు రూ.3 కోట్లు, మార్కెట్​ యార్డు ఆఫీసు విస్తరణకు  రూ.44 లక్షలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.  

వాటిని శనివారం ప్రారంభించనున్నామని చెప్పారు.  మంత్రులు తుమ్మల నాగేశ్వర్​ రావు,  జూపల్లి కృష్ణారావు,  ఎంపీ మల్లు రవి వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్​ చైర్మన్​ విజయవర్ధన్​ రెడ్డి, డైరెక్టర్​మోతె రాముడు, కాంగ్రెస్​ నాయకులు శ్రీనివాస్​ గౌడ్​, రంజిత్​ కుమార్​, దయాకర్​ రెడ్డి, రాజశేఖర్​ పాల్గొన్నారు.