న్యూఢిల్లీ: స్వతంత్ర ప్రతిపత్తి గల లోక్పాల్కు తాజా బడ్జెట్లో రూ.44.32 కోట్లు కేటాయించారు. ఈ నిధులను లోక్పాల్ బిల్డింగ్ నిర్మాణాలకు ఖర్చు చేస్తారు. 2024–25 బడ్జెట్లో లోక్పాల్కు రూ.67.65 కోట్లు కేటాయింగా.. ఈసారి కేటాయింపులు రూ.23.33 కోట్లు తగ్గాయి.
ప్రధాన మంత్రి సహా రాజకీయ నాయకులందరిపైనా ఏమైనా అవినీతి ఆరోపణలు వస్తే, వాటిపై లోక్పాల్ దర్యాప్తు జరుపుతుంది. కాగా.. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు తాజా బడ్జెట్లో రూ.52.07 కోట్లు కేటాయించారు. నిరుడు రూ.51.31 కోట్లు కేటాయించారు. ఈసారి రూ.76 వేలు పెంచారు.