
బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో రాములోరి తలంబ్రాలు, స్టిక్కర్ల కరపత్రాలను డిపో మేనేజర్ విశ్వనాథ్ అవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఏప్రిల్ 7న శ్రీరామనవమి పురస్కరించుకొని భద్రాచలం రాములోరి తలంబ్రాలు కార్గో ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కేవలం రూ.151కే ఇంటి దగ్గరనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల కార్గో ఇన్చార్జి పాల్, కార్గో లాజిస్టిక్ ఇన్చార్జి డీఎంఈ వీకే.కిషోర్, ఉద్యోగులు పాల్గొన్నారు.