మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బహదూర్ పల్లి చౌరస్తా దగ్గర బస్సు డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జీడిమెట్లకు డిపోకు చెందిన బస్సు గండిమైసమ్మ నుంచి సికింద్రాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు డివైడర్ను ఢీకొట్టిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రమాదంతో బహదూర్ పల్లి చౌరస్తా నుంచి సూరారం వరకు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్ ను నియంత్రించారు.