మళ్లీ 20 ఏండ్లకు.. దండేపల్లికి ఆర్టీసీ బస్సు

మళ్లీ 20 ఏండ్లకు.. దండేపల్లికి ఆర్టీసీ బస్సు

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి విలేజ్​కు 20 ఏండ్ల తర్వాత ఆర్టీసీ బస్సు సేవలు శుక్రవారం పున:ప్రారంభమయ్యాయి. వరంగల్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ విజయ భాను బస్సును ప్రారంభించారు. గతంలో ప్రయాణికులు లేకపోవడంతో బస్సు సేవలు రద్దు చేశారు. దీంతో ఆ ఊరి ప్రజలు, విద్యార్థులు ఐదు కిలోమీట్ల దూరంలోని కోతులనడుమ, వల్లభాపూర్​కు వచ్చి బస్సు ఎక్కేవారు. అత్యవసరం ఉన్నవారు ప్రైవేట్​వాహనాలను ఆశ్రయించేవారు. ఇటీవల గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు సమస్యను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి ప్రత్యేక చొరవతో ఈ సర్వీసును ప్రారంభించారు. హనుమకొండ డీఎం ధరమ్​సింగ్, తహసీల్దార్ జగత్​సింగ్, ఎంపీడీవో విజయ్​కుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి తదితరులున్నారు.