Tourism : గోవా, ఊటీనే కాదు.. ఈ పల్లెలకు కూడా పోదాం ఛలో ఛలో..

Tourism : గోవా, ఊటీనే కాదు.. ఈ పల్లెలకు కూడా పోదాం ఛలో ఛలో..

టూర్ అనగానే అందరూ గోవా, ఊటీ, షిమ్లా లాంటి పాపులర్ ప్లేసులకి పరుగులు పెడతారు. కానీ నిజమైన భారతదేశాన్ని చూడాలంటే పాపులర్ టూరిస్ట్ ప్లేసులకు కాకుండా మారుమూల పల్లెలకు వెళ్లాలి. దీన్నే 'రూరల్ టూరిజం' అంటారు. ఇప్పడిప్పుడే ఈ కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతోంది. చాలామంది విదేశీ టూరిస్టులు మనదేశంలోని పల్లెలను సందర్శిస్తూ మన దేశ కల్చర్ను, వాటి రూట్స్​ను  తెలుసుకుంటున్నారు.

ప లైలోని ప్రకృతి అందాల్ని, అక్కడ కళలు, సంస్కృతి, ఆచారాలు తెలుసుకోవటం కోసం గవర్నమెంట్ 'రూరల్ టూరిజం ను డెవలప్ చేస్తోంది. మనదేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్లు మరే దేశంలోనూ లేవు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది మన గ్రామాలను విజిట్ చేస్తున్నారు. పల్లెల్లో ఉండేవాళ్లతో కలిసి.. గ్రామీణ వంటకాల్ని రుచి చూడడం, అక్కడ రకరకాల చేతివృత్తుల వారిని కలుసుకోవటం ఆట పాటలు తిలకించటంతో విదేశీ టూరిస్టులు కొత్త ఎక్స్ పీరియన్స్ ను పొందుతున్నారు. 'భారతదేశపు ఆత్మ పల్లెలోనే ఉంది' అని గాంధీజీ అన్నమాటను నిజం చేస్తూ అందరూ దూరల్ వైపు అడుగులు వేస్తున్నారు. సిటీ లైఫ్ కొన్ని రోజులు బై' చెప్పి, పల్లె వాతావరణంలో సేద తీరాలంటే... కొన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్ కు వెళ్లాల్సిందే. అవేంటంటే..

Also Read:-బైక్స్ కార్లలో మీరు పిల్లలను తీసుకెళుతున్నారా

మలానా : హిమాచల్ ప్రదేశ్ లోని కులు లోయలో ఉన్న మలానా ఒక పురాతన గ్రామం. ఇది మనాలికి దగ్గర్లో ఉంటుంది. ఈ గ్రామానికి ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ కూడా తక్కువే. జనావాసానికి దూరంగా, ఒంటరిగా ఉండే ఈ విలేజ్. డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఇక్కడి వాళ్ళు పాటించే మాల్స్ మాట్లాడే భాష, లైఫ్ స్టైల్ కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. భిన్నమైన కల్సర్ ఉండదం వల్ల ఈ విలేజ్ పై డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి.  ఇక్కడి ప్రజలు వాళ్ల సాంప్రదాయ భాష అయిన 'కనిషి' మాట్లాడతారు. ఇక్కడి వాళ్లంతా వాళ్ల సంప్రదాయాలను పాటించడంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. మనాలి  వచ్చే టూరిస్టులు మలానా. విలేజ్ చూడకుండా వెళ్లరు.

హర్షిల్​: ఉత్తరాఖండ్ ఉండే హర్డిల్ గ్రామం భాగీరథి నది ఒడ్డున, హిమాలయాల్లోని బాపాసా లోయలో ఉంటుంది. చుట్టూ హిమాలయాలు దూరంగా ఎత్తైన పర్వత శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి దగ్గరలోనే మాత్రి. కేదార్​ నాథ్ ఉన్నాయ్. ఈ ప్రాంతమంతా నేచురల్ గా పెరిగిన యాపిల్ తోటలు, నదీ ప్రవాహాలు, జలపాణాలు, పర్వతాలతో నీట్​గా డిజైన్​ చేసినట్టు ఉంటుంది. 

అనెగుండి: కర్ణాటకలోని ఈ గ్రామం రామాయణం కాలం నాటిది.  కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని అనెగుండిని కోతుల రాజ్యం లేదా 'కిష్కింద' అని పిలుస్తారు. ఇది కర్ణాటకలోని ఫేమస్ హెరిటేజ్ సైట్ హంపి కంటే పాతది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో ఎన్నోకట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ ఊరు చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే చరిత్ర గురించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడకు వచ్చే. టూరిస్టులకు ఆతిథ్యం కూడా బాగుంటుంది.

పుత్తూరు :  ఆంధ్రప్రదేశ్లోని ఈ చిన్న గ్రామల పట్టు వ్యాపారానికి ఫేమస్.   ఈ గ్రామంలో వ్యవసాయం పట్టు వ్యాపారం ఎక్కువగా కనిపిస్తాయి. ఈ గ్రామం చుట్టు పక్కల ఉండే మడ అడవులు, అక్కడి సాంప్రదాయ పాత ఇళ్లు ఎంతో అందంగా ఉంటాయి. కొత్తగా అక్కడికి వెళ్లిన వాళ్లకు కొత్త అనుభూతినిస్తాయి. అందమైన గ్రామం, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఇక్కడ కనిపిస్తుంది. ఆతిథ్యం కూడా బాగుంటుంది. చేనేత కార్మికుల జీవన విధానం. పట్టు చీరల తయారీని చూడాలంటే.. పుత్తూరికి వెళ్లాల్సిందే..

తీర్థమలై : తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉన్న తీర్ధమలై..ఇండియాలోని బెస్ట్ రూడల్ టూరిస్ట్ సైట్స్​ లో ఒకటి.  తీర్థమలై అంటే పవిత్రమైన  నీటి కొండ' అని అర్థం. ఈ ఊరులో ఉండే ఆలయాలు ఏడవ శతాబ్దం నాటివి. ఇక్కడ రామ తీర్థ, హనుమాన్ తీర్థ అని రెండు జలపాతాలు దర్శనమిస్తాయి. ఈ గ్రామం కొండలు, జలపాతాలతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

చిత్రకోట్: ఛత్తీనగఢ్​ లోని చిత్రకోట్ గిరిజన సంప్రదాయానికి పెట్టింది పేరు. ఇక్కడ ఉండేవాళ్లు జనావాసానికి దూరంగా అడవిలో గిరిజన సంప్రదాయాలతో జీవిస్తారు. చిత్రకోట్ గ్రామంలో ఉండే జానపద కళలు హస్తకళలు చాలా ఫేమస్. అడవుల్లో జలపాతాల మధ్య ఉండే చిత్రకూట్ టూరిస్టులను ఎంతగానో అకట్టుకుంటుంది. ఇక్కడికి వెళ్తే  దగ్గర్లో జగదల్పూర్ ప్యాలెస్, దంతేశ్వరి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.

హోడ్కా:  గుజరాత్ కచ్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం చాలా అందమైన ప్రాంతం. కచ్​ జిల్లా అంతా తెల్లటి ఎదారితో నిండి ఉంటుంది. చూడడానికి చాలా కొత్తగా అందంగా అనిపిస్తుంది. ఇక్కడి వాతావరణం కూడా కాలాలను బట్టి రంగులు మార్చుకుంటుంది. చలికాలం లో ఇక్కడకు 100కు పైగా పక్షి జాతులు వలసకు వస్తాయి. ఏటా  చలికాలంలో ఇక్కడ 'రన్​ ఉత్సవ్" జరుగుతుంది. మనదేశంలోని పాపులర్ కల్చరల్ ఫెస్టివల్స్ 'రన్ ఉత్సవ్' ఒకటి. ఇక్కడకు వచ్చే టూరిస్టులు రాత్రిళ్లు  తెల్లటి ఎడారిలో టెంట్లు వేసుకుని స్టే చేస్తారు. రాత్రిళ్లు ఆకాశంలో పాలపుంతలు దర్శనమిస్తాయి. ఒక్కసారి ఇక్కడికి వస్తే ప్రతి సంవత్సరం రావాలనిపించేలా ఉంటుంది ఈ ప్రాంతం..

శ్యాం గావ్​ : అస్సాంలోని  జోర్తాటి జిల్లాలో ఉన్న చిన్న బౌద్ధప్రాంతం శ్యాంగావ్​.  ఈ గ్రామం అస్సాం గ్రామీణ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అస్సాం కల్చర్ మిగతా కల్చర్స్ కంటే భిన్నంగా, కొత్తగా ఉంటుంది. ఈశాన్య భారతదేశంలో కల్చర్ ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. శ్యాం గావ్​  ఒక ప్రాచీన గిరిజన గ్రామం. ఇక్కడే ఉండే గిరిజనులు థేరావాద బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు. ఈ ప్రాంతం అడవుల్లో ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది.

కుంబలంగి: కుంబలంగి కేరళ బ్యాక్ వాటర్స్ లో ఉన్న ఒక చిన్న ఐల్యాండ్ లోని గ్రామం. ఇక్కడ జనాభా చాలా తక్కువ. ఈ ప్రాంతం విదేశీ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటుంది. కేరళకు వచ్చే టూరిస్టుల్లో చాలా మంది కుంబలంగికి కూడా వస్తుంటారు. ఈ చిన్న గ్రామంలో స్టే  చేసేందుకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బ్యాక్ వాటర్స్ పై బోట్ లో ఉండడం. బోట్లో షికారుకెళ్ళడం ఇక్కడ వాళ్లకు ఓ హాబీ.  ఇక్కడ నివసించే వాళ్లంతా కళాకారులే. కేరళలోని సాంప్రదాయ కళల్లో నైపుణ్యం ఉన్నవాళ్లు. ఇక్కడకు వచ్చే విదేశీ టూరిస్టులకు ఇక్కడి డ్యాన్స్​ లు, కళలు వంటలు నేర్పిస్తూ ఉంటారు.

మన దగ్గర కూడా... తెలంగాణలో కూడా రూరల్ టూరిస్ట్ స్పాట్స్ కొన్ని ఉన్నాయ్. నల్లమల అడవుల్లోని మన్ననూరు. అక్క మహాదేవి గుహలు, ఉమామహేశ్వరం, ఫరాబాద్, మల్లెల తీర్థం ప్రాంతాలు ఇక్కడి కల్చర్ ను రిఫ్లెక్ట్ చేస్తాయి. అవేకాకుండా గోదావరి ఒడ్డునున్న ఏటూరు నాగారం, తాడ్వాయి. జంపన్నవాగు లాంటి ప్రాంతాలు కల్బర్​తో పాటు, పల్లె అందాలను పచ్చటి వాతావరణాన్ని అందిస్తాయి.

-వెలుగు, లైఫ్​–