
తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని 30 మంది రష్యన్ భక్తులు దర్శించుకున్నారు . ఆలయంలో జరిగిన రాహుకేతు పూజలో వారు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని శిలా నైపుణ్యాలను పరిశీలించారు. విదేశీ భక్తుల దర్శనం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ విశేషాలను వారికి వివరించారు. శ్రీకాళహస్తిని దర్శించుకోవడం చాలా అనందరంగా ఉందని రష్యన్స్ వెల్లడించారు.
ఈ సందర్భంగా రష్యన్స్ తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజ చాలా ఫేమస్. దుష్ప్రభావాల నుండి ఉపశమనం పొందేందుకు భక్తులు ఈ పూజలు చేస్తారు. ఆటువంటి పూజలో ఫిబ్రవరి 05 వ తేదీన రష్యన్ భక్తులు రాహుకేతు పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#WATCH | Andhra Pradesh: A group of 30 Russian devotees participated in the Rahu Ketu puja at Srikalahasti Temple in Tirupati (04/02) pic.twitter.com/RjLvTdm6AR
— ANI (@ANI) February 4, 2024