పుతిన్ వార్నింగ్..మా శత్రువుకు ఆయుధాలిస్తే.. మీపై అణుబాంబులు వేస్తాం

పుతిన్ వార్నింగ్..మా శత్రువుకు ఆయుధాలిస్తే.. మీపై అణుబాంబులు వేస్తాం

పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ 
తమ అణ్వాయుధ పాలసీని మార్చుకున్నామని ప్రకటన 

మాస్కో: పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చారు. తమ శత్రువుకు ఆయుధ సాయం చేసే దేశాలను తమపై డైరెక్ట్​గా దాడి చేసినట్టుగానే భావిస్తామన్నారు. అలాంటి దేశాలపై న్యూక్లియర్ బాంబులు వేస్తామన్నారు. గురువారం మాస్కోలో దేశ అత్యున్నత స్థాయి భద్రతామండలితో పుతిన్​ సమావేశమయ్యారు. దేశ అణ్వాయుధ పాలసీలో మార్పులను ఆమోదించారు.

రష్యాపై వైమానిక దాడులు చేస్తున్న ఉక్రెయిన్​కు అత్యధునిక ‘స్టార్మ్ షాడో’ క్షిపణులను ఇవ్వాలని బ్రిటన్ ఇటీవల నిర్ణయించింది. అలాగే రష్యాపై అనుసరిం చాల్సిన వ్యూహాలపై యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్​తో చర్చించేందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా వెళ్లారు. ఇది పుతిన్​కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

అందుకే తమపై దాడులు చేసే దేశాలకు సాయం చేసే దేశాలపై రష్యా అణ్వాయుధ దాడికి దిగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు తమ దేశ అణ్వస్త్ర పాలసీని మార్చినట్టు ప్రకటించారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు వెపన్స్ ఇచ్చినా, ఆ వెపన్స్ ద్వారా తమపై దాడి జరిగినా.. ఆ దేశాలు రష్యాపై దాడికి పాల్పడినట్టుగానే భావిస్తామన్నారు.