
పంజాగుట్ట, వెలుగు: నిమ్స్హాస్పిటల్ను హెల్త్అండ్ఫ్యామిలీ వెల్ఫేర్కమిషనర్ఆర్వీ కర్ణన్ ఆదివారం సందర్శించారు. హాస్పిటల్ ఐదో అంతస్తు ట్రామా బ్లాక్లో శనివారం జరిగిన విద్యుత్షార్ట్సర్య్కూట్ప్రాంతాన్ని పరిశీలించారు. హాస్పిటల్లో తీసుకుంటున్న ఫైర్ సేఫ్టీ చర్యలపై నిమ్స్డైరెక్టర్ డాక్టర్ బీరప్పను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం విద్యుత్సరఫరా జరుగుతున్న ఎలక్ట్రికల్ప్యానల్బోర్డుల స్థితిగతులను పరిశీలించి, ఆ శాఖ ఇంజినీర్ల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఆయన వెంట ప్రొఫెసర్డాక్టర్గంగాధర్, అడిషనల్ప్రొఫెసర్డాక్టర్లక్ష్మీభాస్కర్, ఆర్ఎంఓ డాక్టర్ సాయినిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
నిమ్స్లో పటాకులు ఎక్కడా లేవు: ఇన్స్పెక్టర్ శోభన్
నిమ్స్ హాస్పిటల్లో తమకు ఎక్కడా పటాకులు దొరకలేదని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపారు. హాస్పిటల్లో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అక్కడి ఓ గదిలో పటాకులు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై నిమ్స్అడిషనల్సూపరింటెండెంట్డాక్టర్ లక్ష్మీభాస్కర్ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఆరోగ్యశ్రీ గదిలో ఎటువంటి పటాకులు దొరకలేదని ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపారు.