వరంగల్ లో గులాబీ సైనికుల గర్జన ఖాయం :  ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

వరంగల్ లో గులాబీ సైనికుల గర్జన ఖాయం :  ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
  • ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహిస్తాం
  • మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

శంషాబాద్, వెలుగు: ఈ నెల 27న వరంగల్ వరంగల్​లో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను అడ్డుకోవడానికి రేవంత్ సర్కార్​కుట్రలు పన్నుతోందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 10 లక్షల మందితో వరంగల్ వేదికగా గులాబీ సైనికులు గర్జించడం ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్​రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం శంషాబాద్ పార్టీ ఆఫీసులో సన్నాహక సమావేశం నిర్వహించారు.

సబితారెడ్డితోపాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్​చార్జ్​పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, జిల్లా నేతలు హాజరయ్యారు. సబితారెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు.