
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ వ్యాప్తంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో అర్హులైన వారికి సదరం పత్రాలు అందించేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా డీఆర్డీఓ శ్రీనివాస్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరం క్యాంపునకు హాజరయ్యే వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని రశీదులో వచ్చిన రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హాజరు కావాలని ఈనెల 12న శారీరక వికలాంగులు, 13న మూగ, వినికిడి లోపం ఉన్న వారికి, 20న దృష్టిలోపం ఉన్న వారికి, 21న మానసిక వికలాంగులకు అర్హులైన వారిని గుర్తించి సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు.