ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ.. ట్రాఫిక్ ఆంక్షలు

ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ.. ట్రాఫిక్ ఆంక్షలు
  • ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలన్న పోలీసులు

హైదరాబాద్: సద్దుల బతుకమ్మ సంబరాలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. ఈ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి ,మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. కళాకారులతో ప్రత్యేక కారక్రమాలు నిర్వహించనున్నారు. 

ఈ నేపథ్యంలో గురువారుం అక్టోబర్ 10, 2024న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమరవీరుల స్మారకస్థూపం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ప్రాంతాల్లో వెళ్లే వారు ప్రత్యమ్నాయా మార్గాలు ఎంచుకోవాలని కోరారు.