Saina Nehwal: కంగనాతో పోలుస్తూ సైనా నెహ్వాల్‌పై సెటైర్స్.. స్పందించిన బ్యాడ్మింటన్ స్టార్

Saina Nehwal: కంగనాతో పోలుస్తూ సైనా నెహ్వాల్‌పై సెటైర్స్.. స్పందించిన బ్యాడ్మింటన్ స్టార్

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వివాదంలో చిక్కుకుంది. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించే వరకు జావెలిన్ గురించి తనకు తెలియదని సైనా నెహ్వాల్ ఇటీవల తెలిపింది. ఆమె  చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సైనా నెహ్వాల్ “కంగనా రనౌత్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్” అంటూ ఈ బ్యాడ్మింటన్ స్టార్ ను ట్రోల్స్ చేస్తున్నారు. భారత్ తరపున మూడు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని.. లండన్ 2012 ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన సైనా నెహ్వాల్ తాజాగా స్పందించారు.

ALSO READ | మా మనుది మనువాడే వయసు కాదు: మను భాకర్ తండ్రి

తనకు కంగనా రనౌత్ తో పోల్చినందుకు ట్రోలర్స్ కు ధన్యవాదాలు తెలిపింది. కంగనా ఎంతో అందంగా ఉంటుందని నెటిజన్స్ కు సెటైర్ విసిరింది. "నా క్రీడలో నేను పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాను. నా దేశానికి బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ పతకాన్ని సాధించాను. నేను మళ్లీ చెబుతున్నాను. బయట నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. కానీ క్రీడలు ఆడటం కష్టం". అని సైనా తన ఎక్స్ లో తెలిపింది. 
 
జావెలిన్ గురించి సైనా ఏం చెప్పిందంటే..?

జర్నలిస్ట్ శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెహ్వాల్ జావెలిన్ ఒలింపిక్ క్రీడగా తనకు తెలియదని పేర్కొంది. “నీరజ్ గెలిచినప్పుడు అథ్లెటిక్స్ లో ఈ గేమ్‌ ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. ఏదైనా మనం చూసినప్పుడే కదా తెలుసుకుంటాం. చూడకపోతే ఎలా తెలుస్తుంది? నిజం చెప్పాలంటే జావెలిన్ త్రో గురించి నాకు తెలియదు". అని వ్యాఖ్యానించింది. జావెలిన్‌లో నీరజ్ చోప్రా రెండు ఒలింపిక్ పతకాలను గెలుచుకున్నారని.. నీరజ్ మా సూపర్ స్టార్ అని సైనా ప్రశంసలు కురిపించింది.