Dhoni Birthday: భర్తంటే ఎంత గౌరవం.. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ధోనీ భార్య

Dhoni Birthday: భర్తంటే ఎంత గౌరవం.. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ధోనీ భార్య

ఎంఎస్ ధోనీ.. ప్రపంచ క్రికెట్‌‌లో తనదైన ముద్ర వేసిన లెజెండ్ మన మహేంద్రుడు. ఎందరో యువ క్రికెటర్లకు రోల్ మోడల్ అతను. ఇక భారత క్రికెట్‌లో అతని ప్రయాణం గురించి చెప్పాలంటే ధోనీకి ముందు, ఆ తరువాత.. అని చెప్పుకోవాలి. అంతలా భారత క్రికెట్‌పై అతను ప్రభావం చూపాడు. యువ ఆటగాళ్లతోనూ మైదానంలో అద్భుతాల సృష్టించడం అతని నైజం. సాధారణ బౌలర్లతోనూ అసాధారణ ప్రదర్శన రాబట్టడం అతనికి అలవాటు. కాలక్రమేణా ఆ మార్పులతో ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాను అగ్రశ్రేణి జట్టుగా నిలిపాడు. దేశానికి మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు. 

అలాంటి మన మహేంద్రుడి పుట్టినరోజు నేడు. 42 ఏళ్ళు పూర్తి చేసుకొని.. 43వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అతని పుట్టినరోజు వేడుకలు అంబానీ కుటుంబసభ్యుల నడుమ జరిగాయి. ప్రస్తుతం ధోని, సాక్షి దంపతులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో, ధోని పుట్టినరోజు వేడుకలు అక్కడే జరిగాయి. ఈ వేడుకల్లో ధోనీ భార్య సాక్షి చేసిన ఓ పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

 కాళ్లు మొక్కి ఆశీర్వాదం

ధోని పుట్టినరోజు సంధర్బంగా అతనికి కేక్ తినిపించిన సాక్షి అనంతరం భర్త పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది. ఆ సమయంలో ఎంఎస్ నవ్వుతూనే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలానే బుద్ధిగా, వినయంగా ఉండు అన్నట్లు ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియోలో మహి తన పుట్టినరోజు కేక్‌ను కత్తిరించి, ఆపై దానిని తన భార్యకు తినిపించడాన్ని చూడవచ్చు. అనంతరం అతను కేక్‌ను రుచి చూస్తుండగా, అతని భార్య అతని పాదాలను తాకి అతని ఆశీర్వాదం కోరింది. ధోనీ బ‌ర్త్ డే వీడియోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.