న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ఫోర్స్ దేశంలోని ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు ప్రజలకు ఆన్లైన్లో సర్వీస్లను అందించడంలో సాయపడేందుకు పబ్లిక్ సెక్టార్ డివిజన్ను లాంచ్ చేసింది. అంతేకాకుండా బ్యాంకులు, లెండర్లు ఆన్లైన్లో అప్పులివ్వడంలో సాయపడేందుకు డిజిటల్ లెండింగ్ సొల్యూషన్లను తీసుకొచ్చింది.
ఇండియాలో డిజిటల్ వాడకం భారీగా పెరిగిందని, ఇక్కడ బోలెడు అవకాశాలు ఉన్నాయని సేల్స్ఫోర్స్ ఇండియా చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య అన్నారు. తమ డిజిటల్ లెండింగ్ సొల్యూషన్లతో బ్యాంకులు కస్టమర్లను వేగంగా చేరుకోవడానికి వీలుంటుందని, ఖర్చులు తగ్గుతాయని అన్నారు.