రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ ను దారుణంగా చంపుతాం : బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో పోలీసులకు మెసేజ్

రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ ను దారుణంగా చంపుతాం : బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో పోలీసులకు మెసేజ్

మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతపై ఉత్కంఠ నెలకొంది. సిద్ధిఖీని కాల్చి చంపిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఇప్పుడు తమ టార్గెట్ సల్మాన్ ఖాన్ అని తేల్చిచెప్పిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే.. 2024, అక్టోబర్ 18వ తేదీన.. ముంబై పోలీసులకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం.. చంపబోతున్నాం అంటూ మెసేజ్ వచ్చింది. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు.. సల్మాన్ ఖాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

సల్మాన్ ను చంపేస్తాం.. చంపకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ముంబై ట్రాఫిక్ పోలీసులకు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వాట్సప్ లో మెసేజ్ చేశారు.  ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే  మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ కంటే దారుణంగా సల్మాన్ ను చంపేస్తామని హెచ్చరించారు. 

Also Read :- సల్మాన్​పై కుట్ర కేసులో మరొకరి అరెస్టు

 అసలు ఈ మెసేజ్ ఏదైనా ముఠా నుంచి వచ్చిందా? లేక పోలీసులను ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా ఆకతాయిలు ఈ పనిచేశారా అనే కోణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన నిందితుల్లో ఒకరిని ముంబై నవీ పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడు సుఖాను హర్యానాలోని పానిపట్ లో అదుపులోకి తీసుకున్నారు. 

లారెన్స్ వెనుక ఎవరైనా ఉన్నారా? 

బాబా సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్​ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్​ను కూడా చంపుతామని బెదిరించింది. అయితే దీనివెనుక గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కాకుండా మరెవరో ఉన్నారని సల్మాన్ కుటుంబసభ్యులు, సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 ‘‘బయటున్న వ్యక్తులను చంపేందుకు జైల్లో నుంచి ఆపరేట్ చేయడం అంత ఈజీనా? అయినా సల్మాన్​ను భయపెట్టేందుకు బాబా సిద్ధిఖీని చంపాల్సిన అవసరమేంటి? ఆయనేం సల్మాన్​ కుటుంబసభ్యుడు కూడా కాదు. ఇదంతా చూస్తే ఏదో జరుగుతోందని అనిపిస్తుంది. దీని వెనుక ఉన్న అసలు దోషులెవరో తేల్చాలి” అని సల్మాన్ కుటుంబసభ్యులు కోరుతున్నారు