- కుంభమేళా తొక్కిసలాటలో యూపీ ప్రభుత్వంపై అఖిలేశ్ ఫైర్
న్యూఢిల్లీ: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాస్తున్నదని సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. 30 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారని అనుమానం వ్యక్తం చేశారు.
పరిహారం చెల్లించకుండా అధికారులు తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్ సెషన్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మృతుల సంఖ్య విషయంలో పారదర్శకత పాటించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదు.
మృతుల కుటుంబాలకు వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలి. ఎంతమంది చనిపోయారు.. వారి పేర్లతో జాబితాను రిలీజ్ చేయాలి” అని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.