
అభయారణ్యాలు బిట్ బ్యాంక్
- వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వు కింద 12 భారత రిజర్వులను గుర్తించారు.
- తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక బయోస్పియర్ రిజర్వు శేషాచలం.
- నీలరిగి బయోస్పియర్ మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
- యునెస్కో వారు మానవుడు, జీవగోళంను ప్రవేశపెట్టిన సంవత్సరం 1971.
- ఏటూరు నాగారం అభయారణ్యం ములుగు జిల్లాలో ఉంది.
- మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న అభయారణ్యం ఏటూరు నాగారం.
- ఏటూరునాగారాం అభయారణ్యాన్ని 1999లో నోటిఫై చేశారు.
- ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర రెండేండ్లకు ఒక్కసారి జరుగుతుంది.
- ఏటూరునాగారం అభయారణ్యం మొత్తం వైశాల్యం 812 చ.కి.మీ.
- కిన్నెరసాని వన్యమృగ సంరక్షణ కేంద్రం 1977లో ఏర్పాటు చేయబడింది.
- రాజీవ్గాంధీ వైల్డ్ లైఫ్ అభయారణ్యంగా పిలిచే అభయారణ్యం అమ్రాబాద్.
- ఏటూరునాగారం అభయారణ్యంలో రాక్షస గుహలు, చారిత్రక యుగానికి చెందిన శిలావాసాలు లభించాయి.
- పాకాల అభయారణ్యం వరంగల్ జిల్లాలో ఉంది.
- పాకాల అభయారణ్యం మొత్తం విస్తీర్ణం 860 చ.కి.మీ.
- శివ్వారం అభయారణ్యం మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉంది.
- మగ్గర్ మొసళ్లను సంరక్షించే అభయారణ్యం శివ్వారం.
- శివ్వారం అభయారణ్యం మొత్తం వైశాల్యం 29.81 చ.కి.మీ.
- హైదరాబాద్ ప్లసీ చట్టం 1952లో అమలులోకి వచ్చింది.
- హైదరాబాద్ రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం హైదరాబాద్ ప్లసీ చట్టం చేశారు.
- మంజీరా అభయారణ్యం సంగారెడ్డి జిల్లాలో ఉంది.
- పోచారం అభయారణ్యం మెదక్ జిల్లాలో ఉంది.
- మూడు నోటిఫైడ్ జాతీయపార్కులను కలిగిన ఏకైక నగరం హైదరాబాద్.
- అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం వైశాల్యం 2166 చ.కి.మీ.
- తెలంగాణలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అమ్రాబాద్.
- కవ్వాల్ అభయారణ్యం గుండా కడెం నది ప్రవహిస్తోంది.
- కవ్వాల్ అభయారణ్యాన్ని కేంద్ర ప్రభుత్వం 2012లో కేంద్రం టైగర్ రిజర్వుగా గుర్తించింది.
- మృగవని జాతీయ పార్కు రంగారెడ్డి జిల్లాలో ఉంది.
- మృగవని జాతీయ పార్కు చిలుకూరు ప్రాంతంలో ఉంది.
- మహావీర్ హరిణి వనస్థలి జాతీయ పార్కు వనస్థలిపురంలో ఉంది.
- జైనమత గురువు వర్ధమాన మహావీరుడు నిర్యాణం పొంది 2500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1975లో హరిణి వనస్థలి పార్కుకు ఆయన పేరు పెట్టారు.
- మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కులో సంరక్షించబడుతున్న ప్రధాన జంతువు జింక.
- హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న జాతీయ పార్కు కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు.
- దేశంలో వెదురును సాగుచేసే హక్కు పొందిన తొలి ప్రాంతం మెందలేఖ.
- 1982లో చీకటి జంతువుల(నిశాచర) ఆవాసాన్ని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ప్రారంభించారు. ఇది దేశంలో మొదటిది.
- మహబూబ్నగర్ లో పిల్లలమర్రి జింకల పార్కు ఉంది.
- సహజ ఆవరణంలో జంతువులను చూపే విధానం కలిగి జూపార్క్ నెహ్రూ జూలాజికల్ పార్కు.
- అందుక్ అనే వృక్షజాలం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా విస్తరించి ఉంది.
- అబ్దుల్ కలాం హరిత పారిశ్రామిక వాడను సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు.
- రాష్ట్ర టీఎస్ఎస్పీఎఫ్ పోలీస్ దళం అమీన్పూర్ చెరువును దత్తత తీసుకుంది.
Sanctuaries are bit banks