కిమ్స్లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్

కిమ్స్లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్

హైదరాబాద్: శ్రీతేజ్కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి విదేశాలకు తీసుకెళ్లాలని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీతేజ్ను ప్రాణాపాయం నుంచి బయటపడేయాలని, శ్రీతేజ్ను కాపాడుకోవాలని బన్నీ డిసైడ్ అయినట్లు సమాచారం. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ను ఆదివారం నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడటంతో బన్నీ వాసు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఫారెన్ తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని, పలకరిస్తే ప్రతి స్పందన చూపించడం లేదని కిమ్స్ వైద్యులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

ALSO READ | జూబ్లీహిల్స్​ రెస్టారెంట్లలో ఫుడ్​ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. కిచెన్​ లో బొద్దింకలను గుర్తించిన ఆఫీసర్స్​

శ్రీతేజ్ ఆసుపత్రి పాలై ఇప్పటికే దాదాపు రెండు నెలలయింది. కిమ్స్ హాస్పిటల్ వంటి ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎంత ఖర్చయినా చూసుకుంటామని అల్లు అర్జున్ ప్రకటించాడు. అయినప్పటికీ ఇప్పటికీ శ్రీతేజ్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో.. విదేశాలకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించడమే మేలనే అభిప్రాయానికి అల్లు అర్జున్ వచ్చినట్లు తెలిసింది. 

డిసెంబర్ 4, 2024న పుష్ప2 బెనిఫిట్​షో రాత్రి 9.30 గంటలకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు పర్మిషన్​ఇవ్వకున్నా అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని​సంధ్య థియేటర్కు వెళ్లగా.. అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె తొమ్మిదేండ్ల కొడుకు శ్రీతేజ్​కోమాలోకి వెళ్లాడు. బ్రెయిన్కు తీవ్ర గాయం కావడంతో అప్పటి నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ తీరును సీఎం రేవంత్​తప్పుపట్టారు.

దీనికి తోడు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను విచారణకు పిలిచి.. ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించడంతో ఆయన తన తప్పును ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అర్జున్ తండ్రి అల్లు అరవింద్, చిత్ర నిర్మాతలు శ్రీతేజ్​దగ్గరికి వెళ్లారు. దర్శకుడు సుకుమార్, అతని భార్య కూడా శ్రీతేజ్ను పరామర్శించారు. దిల్ రాజు పరామర్శించారు. రేవతి కుటుంబానికి సాయంగా రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను డిసెంబర్ 13న అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించి.. మధ్యంతర బెయిల్పై మరుసటిరోజు (14న) చంచల్​గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్కు ఇండస్ట్రీ ప్రముఖులు క్యూ కట్టి సంఘీభావం ప్రకటించారు. కానీ, రేవతి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి తెలుసుకునేందుకు ఆవైపు పెద్దగా ఎవరూ వెళ్లకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.