సంగారెడ్డి ఏపీపీ అరెస్ట్.. రూ.3.2 కోట్లు తీసుకొని భార్య మాయమైనట్లు భర్త ఫిర్యాదు

సంగారెడ్డి ఏపీపీ అరెస్ట్.. రూ.3.2 కోట్లు తీసుకొని భార్య మాయమైనట్లు భర్త ఫిర్యాదు

పంజాగుట్ట, వెలుగు: భర్తతో గొడవ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) ఆచూకీ లభించింది. తన భార్య రూ.3.2 కోట్లు తీసుకొని, వెళ్లిపోయిందని ఆమె భర్త పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె సంగారెడ్డిలో అసిస్టెంట్ పబ్లిక్​ ప్రాసిక్యూటర్గా పని చేస్తున్న అరవింద్​కిరణ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. శనివారం రాత్రి అల్వాల్​నుంచి ఆ ఇద్దరినీ పోలీస్​స్టేషన్కు తీసుకువచ్చారు. మహిళా ఏపీపీకి నోటీసులిచ్చామని, నగదు మాయం కేసులో అరవింద్​ కిరణ్​ను అరెస్ట్​ చేసినట్లు ఇన్​స్పెక్టర్​ శోభన్ ​తెలిపారు.