
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో నిమ్జ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి, తహసీల్దార్తో సమీక్ష నిర్వహించారు.
నిమ్జ్ తో ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. భూములు ఇచ్చేవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని తెలిపారు. దీనిపై ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.