
- సంజీవ్ సన్యాల్ సూచన
న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రెగ్యులేషన్ కోసం ఇండియా రూల్స్ తీసుకొస్తుందని, ఈ ఏఐ రెగ్యులేటర్ సెబీ తరహాలో పనిచేస్తుందని ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ ఎడ్వైజరీ కౌన్సిల్ (పీఎంఈఏసీ) మెంబర్ సంజీవ్ సన్యాల్ వెల్లడించారు. సెల్ఫ్ రెగ్యులేషన్ లేదా బ్యూరోక్రటిక్ రెగ్యులేషన్ బహుశా ఏఐ రెగ్యులేషన్కి సరైనవి కావని పేర్కొన్నారు. టెక్నాలజీని అర్ధం చేసుకునే రెగ్యులేటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అవసరమని, ఈ దిశలో ఇండియా ఆలోచించాలని సంజీవ్ సన్యాల్ చెప్పారు.
టెక్నాలజీ పోకడ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు ఈ రెగ్యులేటరీ ఏజన్సీ అర్ధం చేసుకోవల్సి ఉంటుందని అన్నారు. సెబీ తరహాలో ఒక రెగ్యులేటరీ ఏజన్సీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేషన్ కోసం తీసుకురావల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏఐ ఎటు వెళ్తోందనే అనవసరమైన విషయం పై కాకుండా, ఎలా మారుతోందనే అంశంపైనే ఆ రెగ్యులేటరీ ఫోకస్ పెట్టాలని సంజీవ్ సన్యాల్ సూచించారు.
ఫైనాన్షియల్ మార్కెట్లో సర్క్యూట్ బ్రేకర్ల లాగే, ఏఐ రెగ్యులేషన్లోనూ నియంత్రణాపరమైన రూల్స్ ఉండాలన్నారు. ఆడిట్ మాదిరిగా రెగ్యులర్ ఆడిట్స్ ఉండాలని, బిజినెస్ మోడల్స్– అకౌంట్లను కంపెనీలు వివరించే మాదిరిగానే ఏఐ ఏ విధంగా పనిచేస్తోందో వివరించేలా విధానాలు ఉండాలన్నారు.