హైదరాబాద్​లో ఎస్పీయూ రీజనల్ ఆఫీసు ప్రారంభం

హైదరాబాద్​లో ఎస్పీయూ రీజనల్ ఆఫీసు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: సంకల్పచంద్ పటేల్ యూనివర్సిటీ హైదరాబాద్​లో శుక్రవారం రీజనల్​ ఆఫీసును ప్రారంభించింది. దక్షిణాది స్టూడెంట్లకు కెరీర్ కన్సల్టింగ్, ప్లేస్‌‌‌‌మెంట్ అసిస్టెన్స్​ సహాయం అందించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.

దక్షిణ రాష్ట్రాల విద్యార్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుందని యూనివర్సిటీ ప్రెసిడెంట్ ​ప్రకాష్ భాయ్ పటేల్ అన్నారు. కార్యక్రమంలో ఎస్​పీయూ ప్రొవోస్ట్ ప్రఫుల్ కుమార్ ఉదానీ, రిజిస్ట్రార్  పరిమల్ త్రివేదీ, ప్రిన్సిపల్ పటేల్ పాల్గొన్నారు.