
జోగిపేట, వెలుగు: నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శరత్కుమార్ సూచించారు. మంగళవారం ఆందోల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.
నారాయణ్ ఖేడ్: పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ శరత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద తగు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్, సహాయ అధికారి దేవదాస్, డీఎస్పీ వెంకటరెడ్డి ఉన్నారు.