Current Topic : నిజాం కాలంలో పత్రికలు

Current Topic : నిజాం కాలంలో పత్రికలు

*హైదరాబాద్​ సంస్థానంలో  తొలి తెలుగు పత్రిక సరోజినీ విలాస్. ఇది​ మహబూబ్​ నగర్ జిల్లా నుంచి వెలువడింది. ఈ పత్రికను1912లో శ్రీనివాస్​ శర్మ స్థాపించారు. 

* 1917లో దివ్యజ్ఞాన సమాజానికి చెందిన స్వామి వెంకటరావు ఆంధ్రమాత పత్రికను స్థాపించారు.

* 1924 ఆగస్టు 24న షబ్నవీసు వెంకటరామ నరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండలో నీలగిరి అనే వార పత్రిక ప్రారంభమైంది. ఇది హైదరాబాద్​ సంస్థానంలో తొలి పూర్తిస్థాయి రాజకీయ తెలుగు పత్రిక. 

* 1922 ఆగస్టు 27న వరంగల్​ జిల్లా మానుకోట తాలుకా ఇనుగుర్తి నుంచి తెనుగు అనే వారపత్రిక వెలువడింది. ఈ పత్రిక సంపాదకులు వొద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు సోదరులు.

* 1920లో ఆంధ్రాభ్యుదయం, దేశబంధు పత్రికలు వెలువడ్డాయి.

*1923లో వరంగల్​ నుంచి ముదిగొండ వీరభద్రశాస్త్రి సంపాదకత్వంలో శైవ ప్రచారిణి అనే మాస పత్రిక ప్రారంభమైంది.

* 1925లో సికింద్రాబాద్​ నుంచి ఆంగ్ల–తెలుగు ద్విభాష పత్రిక ‘నేడు’ వెలువడింది. ఈ పత్రికను భాస్కర్​ ప్రచురించారు.

* గోల్కొండ పత్రికకు సురవరం ప్రతాపరెడ్డి 1926 నుంచి 1946 వరకు సంపాదకులుగా పనిచేశారు.

* గోల్కొండ పత్రిక కంటే ముందు తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం, నిజామాంధ్ర ఉద్యమాన్ని నీలగిరి, తెనుగు పత్రికలు ప్రోత్సహించాయి. 

* 1927లో పీఎస్​ శర్మ సంపాదకత్వంలో సుజాత అనే పత్రిక వెలువడింది.

* 1924లో సికింద్రాబాద్​ నుంచి ఆంధ్రకేసరి అనే ఆంగ్ల–తెలుగు వారపత్రికను అడుసుమిల్లి దత్తాత్రేయ శర్మ ప్రచురించారు.

* వడ్డేపల్లి గ్రామం నుంచి వెలువడిన దేశబంధు మాసపత్రికకు బెల్లంకొండ రామానుజాచార్యులు, నరసింహాచార్యులు సంపాదకత్వం వహించారు. 

* నల్లగొండ జిల్లా రామన్నపేట తాలుకా వలిగొండకు చెందిన బిఎస్​ శర్మ విజయవాడ నుంచి తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ఆంధ్రవాణి పత్రికను వెలువరించారు.

* 1929లో హైదరాబాద్​ నగరంలో హైదరాబాద్​ బులెటిన్​ అనే పత్రికను బుక్కపట్టణం రామానుజాచార్యులు ప్రారంభించారు.

* 1925లో భాగ్యనగర్​ పత్రికను ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ స్థాపించారు. ఈ పత్రిక తర్వాతి కాలంలో ఆది హిందూ వారపత్రికగా వెలువడింది.

* విభూతి పత్రికకు వీరభద్రశర్మ సంపాదకత్వం వహించారు.

* వరంగల్​ నుంచి దేవులపల్లి రామానుజాచార్యులు సంపాదకత్వంలో శోభ పత్రిక వెలువడింది. 

* 1942లో రామానుజాచార్యుల సంపాదకత్వంలో తెలంగాణ పత్రిక వెలువడింది. ఈ పత్రికలో చార్మినార్​ గాసిప్​ శీర్షిక కింద అంత:పురంలోని విషయాలు, 
* 1937లో దక్కన్ క్రానికల్​ వార పత్రికను రామానుజాచార్యులు, రాజగోపాల్​ కలసి స్థాపించారు. ఈ పత్రికకు సంపాదకుడు రామానుజాచార్యులు. దక్కన్​ క్రానికల్​ 1939లో దినపత్రికగా మారింది.  
* 1934లో సికింద్రాబాద్​ నుంచి దక్కన్​ కేసర్​ అనే ద్విభాషా పత్రికను దత్తాత్రేయ శర్మ ప్రచురించారు. 

* సికింద్రాబాద్​ నుంచి తెలుగు తల్లి పత్రికను రాచముళ్ల సత్యవతీ దేవి ప్రచురించారు. 
* 1937లో దివ్వవాణి పత్రికను అప్పయ్యశాస్త్రి ప్రచురించారు. 
* 1945లో చెల్లా సుబ్బారావు ప్రచురించిన పత్రిక తరణి.
* ది ఆంధ్రకేసరి అనే పత్రిక కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వెలువడింది. 
* కలకత్తాకు చెందిన గులాం మహమ్మద్​ హైదరాబాద్​లో మూడు భాషల్లో మూడు పత్రికలను మీజాన్​ పేరిట ప్రారంభించారు. తెలుగు మీజాన్​ పత్రిక సంపాదకులు అడవి బాపిరాజు.
* మందముల నర్సింగరావు సంపాదకత్వంలో రయ్యత్​ పత్రిక వెలువడింది. 
 * ఇమ్రోజ్​ పత్రిక స్థాపకుడు షోయబుల్లాఖాన్. ఈ ఉర్దూ పత్రిక రజాకార్ల అరచకాలు, దౌర్జన్యాలను తీవ్రంగా విమర్శించింది.