ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదనే..

ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదనే..

రామడుగు, వెలుగు: తమ గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆఫీసర్లకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని రామడుగు మండలం వన్నారం సర్పంచ్​ జాడి లక్ష్మి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శుక్రవారం పంచాయతీ ఆఫీసు డోర్లు వేసుకొని స్వీయ నిర్బంధం విధించుకున్నారు. వన్నారం పక్కనే ఉన్న వాగులోంచి నిత్యం 200కు పైగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రావాణా చేస్తున్నారని ఇదివరకే కలెక్టర్​తో పాటు తహసీల్దార్​, ఎస్ఐ,  మైనింగ్​ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోకపోవడంతో స్వీయనిర్బంధం విధించుకున్నట్టు సర్పంచ్​ చెప్పారు. రామడుగు ఎస్ఐ అంజయ్య అక్కడికి వచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటానని హామీ ఇవ్వడంతో తలుపులు తీసి బయటకు వచ్చారు.