సెప్టెంబర్ 30న సత్యదేవ్ ప్యాన్ ఇండియా చిత్రం గ్లింప్స్.

సెప్టెంబర్ 30న సత్యదేవ్ ప్యాన్ ఇండియా చిత్రం గ్లింప్స్.

పలు టాలీవుడ్ సినిమాలలో హీరోగా, విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరో సత్యదేవ్ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం హీరో సత్యదేవ్ తెలుగులో జీబ్రా అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి గతంలో ప్రముఖ హీరోయిన్ కీర్తీ సురేష్ నటించిన పెంగ్విన్ చిత్ర దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో జెనిఫర్ పిచినాటో, ప్రియా భవానీ శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య మరియు ధనంజయ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. 

ఆర్ధిక నేరాలు మరియు థ్రిల్లర్ సప్సెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకేకించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ని సెప్టెంబర్ 30వ తారీఖున విడుదుల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 

అయితే ఈ జీబ్రా చిత్రం అక్టోబర్ 31వ తారీఖున తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. 

ALSO READ : ఆ సూపర్ హిట్ చిత్రంలో విలన్ చేంజ్ అయ్యాడా..?

నటుడు సత్యేదేవ్ సినీ కెరీర్ కోసం లక్షల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ కొలువుని వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాడు. ఈ క్రమంలో వరుస సినిమాల్లో నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు.