మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్జిల్లా కురవి మండలం పెద్దతండాకు చెందిన గిరిజన మహిళ అయిన తనను శాసనమండలి బీఆర్ఎస్ విప్ గా ఎంపిక చేసినందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మాజీ సీఎం కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్హౌజ్లో కలసి పూల మొక్కను అందజేశారు.